వైకాపాలో చేరిన పివిపి

ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌ (పీవీపీ) వైకాపాలో చేరారు. ఆయన విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం స్థానానికి పోటీ చేయనున్నారు. పివిపితో పాటుగా తెదేపా ఎంపీ తోట నరసింహం దంపతులు, సినీ నటుడు రాజా రవీంద్ర కూడా వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. లోటస్‌ పాండ్‌లో జగన్‌ సమక్షంలో బుధవారం వారు పార్టీ కండువా కప్పుకున్నారు.

మరోవైపు, ఏపీలో ఇటు వైకాపా, అటు టీడీపీలోనూ భారీగా చేరికలు జరుగుతున్నాయి. టికెట్ ఖరారు కానీ నేతలు పక్క పార్టీలవైపు చూస్తున్నారు. టికెట్లు ఖరారు చేసుకొంటున్నారు. ప్రధాన పార్టీలు టీడీపీ, వైకాపా, జనసేనల అధినేతలు అభ్యర్థులని ఖరారు చేసే పనిలో ఉన్నారు. ఇవాళ ఈ మూడు పార్టీల నుంచి అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.