కోలీవుడ్’లో రస్మిక.. మొదలెట్టింది !

రష్మిక మందన.. తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదిగే క్రమంలో ఉంది. ‘ఛలో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రష్మిక.. ‘గీతగోవిందం’ బ్లాక్ బస్టర్ హిట్ అందుకొంది. ‘దేవదాసు’తో ఆకట్టుకొంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రెడ్’లో నటిస్తోంది. ఇదీగాక, రాజమౌళి మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’, అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ నటించనున్న సినిమా కోసం రష్మ్మిక పేరు వినిపిస్తోంది. ఈ రెండు సినిమాలు పడితే రస్మిక స్టార్ హీరోయిన్ అయిపోయినట్టే.

ఇదిలావుండగా.. కోలీవుడ్ లోనూ రస్మిక ప్రయాణం మొదలైంది. ‘రెమో’ దర్శకుడు బక్కియరాజ్‌ కన్నన్‌ దర్శకత్వంలో కార్తీ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం రస్మికని హీరోయిన్ గా తీసుకొన్నారు. బుధవారం ఈ చిత్ర ప్రారంభోత్సవానికి రస్మిక హాజరైంది. దీనికి సంబంధించిన ఫోటోలని రస్మిక షేర్ చేసింది.

‘నన్ను నటిగా కన్నడ, తెలుగు ప్రేక్షకులు ఎంతో గొప్పగా ఆదరించారు. 2019లో కోలీవుడ్‌కు రమ్మని మీరూ అడిగారు (కోలీవుడ్‌ ఫ్యాన్స్‌), చివరికి వచ్చేశా. మీకు నా అమితమైన ప్రేమను పంపుతున్నా. కార్తి, తదితర బృందంతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది’ అంటూ రాసుకొచ్చింది.