వైసీపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల వాయిదా

వైసీపా అభ్యర్థుల తొలి జాబితా విడుదల వాయిదా పడింది. ఇవాళ (బుధవారం) ఉదయం 10గంటల 20నిమిషాలకి వైసీపీ అభ్యర్థుల జాబితాని విడుదల చేయాలని భావించారు. ఇప్పుడది ఈ నెల 16కు వాయిదా పడింది. నేతల చేరికతో జగన్ బిజీగా ఉండటం ఇందుకో ఓ కారణమని తెలిసింది. దీంతో పాటు ఎన్నికల ప్రచార ఏర్పాట్లని చేసుకొనే పనిలో జగన్ ఉన్నారు.

ఇందుకోసం పార్టీ నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. ప్రతి రోజు నాలుగు లేదా ఐదు నియోజవర్గాల్లో ప్రచారం చేసే విధంగా జగన్ ఏర్పాట్లు చేసుకొంటున్నారు. ఇందుకోసం హెలీకాప్టర్ వినియోగించాలని నిర్ణయించినట్టు తెలిసింది. రోడ్ షోలు, బహిరంగ సభలతో ప్రచారాన్ని హోరెత్తించేలా జగన్ ఏర్పాట్లు చేసుకొంటున్నారు. ఈ నేపథ్యంలోనే అభ్యర్థుల తొలిజాబితా విడుదలని వాయిదా వేసినట్టు తెలిసింది.

మరోవైపు, ఇప్పటికే 150మంది అభ్యర్థుల ఎంపిక ఖరారైనట్టు తెలుస్తోంది. మిగిలిన 25 మంది అభ్యర్థులని కూడా ఒకట్రెండు రోజుల్లో ఫైనల్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇక, టీడీపీ అభ్యర్థుల తొలి జాబితాని రేపు విడుదల చేయడానికి రెడీ అవుతోంది. జనసేన ఇప్పటికే తొలి జాబితాని రెడీ చేసింది. ఏ క్షణమైనా జనసేన తొలిజాబితాని విడుదల చేసే ఛాన్స్ కనిపిస్తోంది.