దానయ్యకు వందకోట్ల ఆఫర్.. నిజమే !

నిర్మాత డివివి దానయ్యకు ‘బాహుబలి’ నిర్మాతలు రూ. 100కోట్ల ఆఫర్ ఇచ్చారనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా రాజమౌళి మల్టీస్టారర్ #RRR తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఈ చిత్రానికి డివివి దానయ్యని నిర్మాతగా ఎంచుకొన్నారు రాజమౌళి. ఐతే, ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొంటే రూ. 100కోట్లు ఇస్తామని బాహుబలి నిర్మాతలు ఆఫర్ చేశారనే న్యూస్ బయటికొచ్చింది. వైరల్ అయ్యింది. తాజాగా, ఈ ఆఫర్ పై దానయ్య స్పందించారు.

ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు. వందకోట్ల ఆఫర్ వచ్చిన మాట వాస్తమే. ఐతే, రాజమౌళి సినిమాని ఎలా వదులుకుంటాను. ఆయనతో సినిమా చేయాలన్నది డ్రీమ్. అందుకే ఆఫర్ ని రిజక్ట్ చేసినట్టు తెలిపారు. ఇక, #RRR మల్టీస్టారర్ ని దాదాపు రూ. 350-400కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు. ఈ చిత్రాన్ని 2020 జూన్ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు తెలిపారు. అల్లూరి సీతారామరాజు, కొమరంభీమ్ ల కథతో ఈ మల్టీస్టారర్ తెరకెక్కుతోంది. అలియా భట్, డైసీ అడ్గార్జియోన్స్‌ హీరోయిన్స్.