జనసేన అభ్యర్థుల తొలి జాబితా వచ్చేసింది


అభ్యర్థులని ప్రకటించడంలో జనసేన పార్టీ ముందుంది. నాలుగు రోజుల క్రితమే తొలి జాబితా రెడీ అయిందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ జాబితాని బుధవారం అర్థరాత్రి విడుదల చేశారు. తొలి జాబితాగా 4 లోక్‌సభ స్థానాలకు, 32 శాసనసభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఈ జాబితాలో మాజీ మంత్రులు రావెల కిషోర్‌ బాబు, పసుపులేటి బాలరాజు, నాదెండ్ల మనోహర్‌, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్‌ తదితర ముఖ్యులున్నారు.

పార్లమెంటు స్థానాలు :

* అమలాపురం : డీఎంఆర్‌ శేఖర్‌

* రాజమహేంద్రవరం : ఆకుల సత్యనారాయణ

* విశాఖపట్నం : గేదెల శ్రీనుబాబు

* అనకాపల్లి : చింతల పార్థసారథి

శాసనసభ అభ్యర్థులు :

* యలమంచిలి: సుందరపు విజయ్‌ కుమార్‌

* పాయకరావుపేట: నక్కా రాజబాబు

* పాడేరు: పసుపులేటి బాలరాజు

* రాజాం: ముచ్చా శ్రీనివాసరావు

* శ్రీకాకుళం: కోరాడ సర్వేశ్వరరావు

* పలాస: కోత పూర్ణచంద్రరావు

* ఎచ్చెర్ల: బాడాన వెంకట జనార్దన్‌ (జనా)

* నెల్లిమర్ల: లోకం నాగ మాధవి

* తుని: రాజా అశోక్‌బాబు

* రాజమహేంద్రవరం గ్రామీణ: కందుల దుర్గేష్‌

* రాజోలు : రాపాక వరప్రసాద్‌

* పి.గన్నవరం: పాముల రాజేశ్వరి

* కాకినాడ సిటీ: ముత్తా శశిధర్‌

* అనపర్తి: రేలంగి నాగేశ్వరరావు

* ముమ్మడివరం: పితాని బాలకృష్ణ

* మండపేట: వేగుళ్ల లీలాకృష్ణ

* తాడేపల్లిగూడెం: బొలిశెట్టి శ్రీనివాస్‌

* ఉంగుటూరు: నౌడు వెంకటరమణ

* ఏలూరు: రెడ్డి అప్పలనాయుడు

* తెనాలి: నాదెండ్ల మనోహర్‌

* గుంటూరు పశ్చిమ: తోట చంద్రశేఖర్‌

* ప్రత్తిపాడు: రావెల కిషోర్‌బాబు

* వేమూరు : ఏ.భరత్‌ భూషణ్‌

* నరసరావుపేట : సయ్యద్‌ జిలానీ

* కావలి : పసుపులేటి సుధాకర్‌

* నెల్లూరు గ్రామీణ: చెన్నారెడ్డి మనుక్రాంత్‌ రెడ్డి

* ఆదోని: మల్లికార్జునరావు (మల్లప్ప)

* ధర్మవరం: మధుసూధన్‌రెడ్డి

* రాజంపేట: ప్రత్తిపాటి కుసుమ కుమారి

* రైల్వేకోడూరు: బోనాసి వెంకట సుబ్బయ్య

* పుంగనూరు: బోడె రామచంద్ర యాదవ్‌

* మచిలీపట్నం: బండి రామకృష్ణ