పరశురామ్ దర్శకత్వంలో మహేష్ సినిమా ?

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా తీసుకొచ్చేందుకు చాన్నాళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గీతలో సినిమా చేసేందుకు మహేష్ ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో మహేష్ కోసం సరైన కథ, ఆ కథని డీల్ చేసే దర్శకుడి వేటలో అల్లు అరవింద్ ఉన్నట్లు వార్తలొచ్చాయ్. ఈ సినిమాకు ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నట్టు వార్తలొచ్చాయ్. ఇప్పుడీ సినిమా కోసం పరశురామ్ పేరు తెరపైకి వచ్చింది.

గత యేడాది ‘గీత గోవిందం’ సినిమాతో గీత ఆర్ట్స్ కి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు పరశురామ్. ఈ సినిమా ఏకంగా రూ. 100కోట్ల క్లబ్ లోచేరిపోయింది. ఇప్పుడు పరశురామ్ మహేశ్ కోసం ఓ కథని రెడీ చేశాడు. దాన్ని త్వరలోనే మహేష్ కి వినిపించేందుకు అరవింద్ ఏర్పాట్లు చేసినట్టు తెలిసింది. కథ నచ్చితే.. మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అదే జరిగితే.. పరశురామ్ బంపర్ ఆఫర్ కొట్టిసినట్టే.. ! ప్రస్తుతం మహేష్ మహర్షి సినిమాతో బిజీగా ఉన్నారు. తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత గీతలో మహేష్ సినిమా ఉండనుంది.