మైఖేల్’తో శృతి బ్రేకప్ ?

హీరోయిన్ శృతిహాసన్ ప్రేమలో ఉందన్న సంగతి తెలిసిందే. లండన్’కు చెందిన మైఖేల్ కోర్సలేతో డేటింగ్ లో ఉంది. అతడిని కుటుంబ సభ్యులకి పరిచయం చేసింది. వీరి పెళ్లికి పెద్దలు ఓకే చెప్పేశారు. త్వరలోనే వీరి పెళ్లి అనే ప్రచారం జరిగింది. ఐతే, ఇప్పుడు వీరి ప్రేమకి బ్రేకులు పడినట్టు సమాచారమ్. మైఖైల్ కి శృతి బ్రేకప్ చెప్పినట్టు తెలుస్తోంది.

దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత శృతి మళ్లీ దక్షిణాదిన బిజీ అయిపోయేందుకు ప్లాన్ చేసుకొంటోంది. వరుసగా సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శృతి మాట్లాడుతూ.. ‘నా విషయంలో చాలా కాలంగా అనుకొంటున్న మంచి పని జరిగిపోయింది. నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. అదృష్టం నన్ను వెంటాడింది. దేవుడి దీవెనలు నాపై కురిసాయి’ అంది.

గత కొన్నాళ్లుగా శృతిపై జరుగుతున్న ప్రచారంలో మైఖైల్ తో ప్రేమ వివాహం ఒకటి. ప్రస్తుతం శృతి ఉత్సాహం చూస్తుంటే.. మైఖేల్‌తో ప్రేమకు బ్రేకులు పడినట్టు చెప్పుకొంటున్నారు. ఆ కారణంగానే ఆమె మళ్లీ ఆఫర్ల కోసం ప్రయత్నిస్తున్నదనే మాట వినిపిస్తున్నది. ప్రేమలో వైఫల్యం నేర్పిన గుణపాఠంతో ఆమె మరింత ఉత్సాహంగా సినిమాలు చేసేందుకు రెడీ అవుతుందా.. ? అనే అనుమానాలు కలుగుతున్నాయి. వీటిపై శృతి మరింత క్లారిటీ ఇస్తే బాగుణ్ను.