ఢిల్లీలో సంతోషం నింపిన దాదా !

ఐపీఎల్ 12వ పండగ వచ్చేస్తోంది. ఈ నెల 23 నుంచి ఐపీఎల్ సమరం మొదలుకానుంది. ఇక, క్రికెట్ అభిమానులకిక ప్రతి రోజూ పండగే. ధనాధన్‌ బ్యాటింగ్‌తో.. అబ్బురపరిచే బౌలింగ్‌, ఆహా అనిపించే ఫీల్డింగ్‌ విన్యాసాలతో మైదానాల్లో మంటలు పుట్టించేందుకు, రెండు నెలల పాటు వీక్షకులను ఉర్రూతలూగించేందుకు వస్తోంది ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌. ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత పేలవ ప్రదర్శన చేసిన జట్టు దిల్లీ డేర్‌డెవిల్స్.. ఈసారి పేరు మార్చుకొంది. ‘దిల్లీ క్యాపిటల్స్‌’గా 2019లో రంగంలో దూకబోతోంది. పేరునైతే మార్చుకుంది కానీ.. రాతను మార్చుకోగలదా ? అన్నది చూడాలి.

ఢిల్లీ క్యాపిటల్స్‌ కాగితంపై బాగానే కనిపిస్తోంది. విజేతగా నిలవడానికి అవసరమైన వనరులు ఉన్నట్లే అనిపిస్తోంది. కానీ స్థాయికి తగినట్లుగా, సమష్టిగా ఆడలేకపోవడమే ఆ జట్టు సమస్య. ఐతే, ఈసారి జట్టు సలహాదారుడుగా సౌరభ్‌ గంగూలీ వచ్చేశారు. ఆయన జట్టులో స్పూర్తినిప్పి జట్టుని విజయపథంలో నడిపిస్తారని చెప్పుకొంటున్నారు.

ఢిల్లీ కాపిటల్స్ జట్టు : ధావన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, కోలిన్‌ ఇంగ్రామ్‌, మన్‌జోత్‌ కల్రా, హనుమ విహారి, పృథ్వీ షా, రిషబ్‌ పంత్‌, అంకుశ్‌ బైన్స్‌, రాహుల్‌ తెవాతియా, కోలిన్‌ మున్రో, అక్షర్‌ పటేల్‌, కీమో పాల్‌, జలజ్‌ సక్సేనా, హర్షల్‌ పటేల్‌, క్రిస్‌ మోరిస్‌, షెర్ఫాన్‌ రూథర్డ్‌ఫర్డ్‌, ఇషాంత్‌ శర్మ, అమిత్‌ మిశ్రా, ట్రెంట్‌ బౌల్ట్‌, అవేష్‌ ఖాన్‌, నాథూ సింగ్‌, రబాడ, బండారు అయ్యప్ప, సందీప్‌ లచిమానె సభ్యులతో బలంగా కనిపిస్తోంది.