తన మరణవార్తపై స్పందించిన సునీల్


టాలీవుడ్ నటుడు సునీల్ మృతి చెందారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కారు నుజ్జు నుజ్జైంది. సునీల్ అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో టాలీవుడ్ లో విషాదం నెలకొంది. సునీల్ ఆఖరి చూపు కోసం టాలీవుడ్ ప్రముఖులు తరలివస్తున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వార్త సునీల్ దృష్టికి వెళ్లింది. దీంతో తన మరణ వార్తపై సునీల్ స్పందించారు. ఇది ఫేక్ న్యూస్. ఇలాంటి ఫేక్ న్యూస్ ని నమ్మొదు. నేను క్షేమంగా ఉన్నానంటూ ట్విట్ చేశారు సునీల్. అంతేకాదు.. తన చావుపై కథనం రాసిన వెబ్ సైట్ స్క్రీన్ షాట్ ని సునీల్ జత చేశారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. హీరోగా హిట్స్ రాకపోవడంతో సునీల్ కమెడియన్ గా రీ-ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రవితేజ ‘అమర్ అక్భర్ ఆంథోనీ’, ఎన్టీఆర్ ‘అరవింద సమేత’లోనూ కమెడియన్ గా నటించారు. ప్రస్తుతం ఆయన కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సాయిధరమ్ తేజ్ ‘చిత్రలహరి’ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్ లో మునుపటి సునీల్ కనిపించాడని చెప్పుకొంటున్నారు. ఈ సినిమాలో పాత సునీల్ కనిపిస్తాడని చెబుతున్నారు. అదే జరిగితే మరోసారి సునీల్ కమెడియన్ గా బిజీ అయిపోవడం ఖాయం.