8మందితో తెలంగాణ కాంగ్రెస్ తొలి జాబితా

తెలంగాణ కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి వచ్చినట్టు సమాచారమ్. ఇప్పటికే 8మంది అభ్యర్థులని అధిష్టానం ఖరారు చేసినట్టు తెలుస్తోంది. మరో 9మంది అభ్యర్థులని ఎంపిక చేయాల్సి ఉంది. ఐతే, తొలి విడతగా 8మందితో కూడిన అభ్యర్థుల లిస్టులని ఏ క్షణంలోనైనా విడుదల చేసే అవకాశాలున్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల ఖరారుపై శుక్రవారం యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ నివాసంలో కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) భేటీ అయింది. మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, తెలంగాణ అభ్యర్థులపై సమావేశంలో చర్చించారు. ఈ భేటీకి కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు గులాంనబీ ఆజాద్‌, అహ్మద్‌పటేల్‌, కేసీ వేణుగోపాల్‌, వీరప్ప మొయిలీతో పాటు తెలంగాణ నుంచి రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హాజరయ్యారు.