చిన్నాన్నను చంపేసి ఆధారాలు లేకుండా చేసిన జగన్ !?


చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డిని చంపేసి ఆధారాలు లేకుండా చేశాడని వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 126మందితో కూడిన అభ్యర్థుల తొలి జాబితాని విడుదల చేసిన చంద్రబాబు.. ఎన్నికల ప్రచారాన్ని మొదలెట్టారు. ఇందులో భాగంగా ఆదివారం విశాఖపట్నంలో ఎన్నికల ప్రచార సభని నిర్వహించారు. ఈ సభలో ప్రసగించిన చంద్రబాబు జగన్’పై షాకింగ్ కామెంట్స్ చేశారు. చిన్నాన్నను చంపేసి ఆధారాలు లేకుండా చేసిన వ్యక్తి మనకు కావాలా ? అంటూ ప్రజలని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై పదునైన విమర్శలు చేశారు బాబు.

‘మోసం చేయడంలో మోదీ, అమిత్‌ షా దిట్టలు. తెలంగాణ, మోదీ వల్ల మనకు అన్యాయం జరిగితే జగన్‌ వెళ్లి వాళ్లతో కలిసి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. కేసీఆర్‌ కాళ్లు మొక్కే జగన్‌ కావాలా ? చిన్నాన్నను చంపేసి ఆధారాలు లేకుండా చేసిన వ్యక్తి మనకు కావాలా ? మీలో కసి ఉంటే కేసీఆర్‌ బలపర్చిన జగన్‌కు ఓట్లేయొద్దు. కనీసం వైకాపాకు ప్రతిపక్షంలో ఉండే హోదా కూడా లేదు. ఈ సారి వైకాపాకు బోణీ కూడా ఉండదు. మిషన్‌ 150 ప్లస్‌కు శ్రీకారం చుట్టాం. 25 ఎంపీ స్థానాలు మనమే గెలవాలి. జిల్లాలో అన్ని స్థానాలు గెలిపించండి. ప్రతిపక్షాన్ని చిత్తుగా ఓడించి డిపాజిట్లు రాకుండా చేయడం మీ చేతుల్లోనే ఉంది” అన్నారు చంద్రబాబు.