తేజు న్యాయపోరాటం చేస్తాడా ?

మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ న్యాయపోరాటం చేసేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారమ్. ప్రస్తుతం తేజు ప్లాపుల్లో ఉన్నాడు. ఆ ప్లాపుల్లోని బయటపడేందుకు ‘చిత్రలహరి’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకుడు. తేజు సరసన కళ్యాణి ప్రియదర్శన్, నివేత పేతురాజ్ నటిస్తున్నారు. ఏప్రిల్ 12 ‘చిత్రలహరి’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ ని చూస్తే.. ఈసారి తేజుకి కచ్చితంగా విజయం దక్కేలా అనిపిస్తోంది.

‘చిత్రలహరి’ సినిమా హిట్ అయినా.. కాకపోయినా సరే తేజు న్యాయపోరాటం మాత్రం ఆపడట. ఇంతకీ తేజు న్యాయపోరాటం ఎవరిపైనా ? ఎందుకు ?? తెలుసుకొందాం పదండీ.. ! ‘చిత్రలహరి’ తర్వాత మారుతి దర్శకత్వంలో తేజు ఉండనుంది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ నిర్మించనుంది. ఈ సినిమాలో తేజు సీరియస్ లాయర్ పాత్రలో కనిపించబోతున్నారంట. చిరంజీవి సూపర్ హిట్ అభిలాషలో పాత్ర గుర్తుకు వచ్చే విధంగా ఈ సినిమా ఉండనుందని సమాచారమ్. ఈ చిత్రంలో తేజుకి జంటగా రకుల్ జతకట్టనుంది

‘చిత్రలహరి’ సినిమా తర్వాత వెంటనే తేజు న్యాయపోరాటం మొదలుకాదట. రెండు నెలల పాటు గ్యాప్ తీసుకొని.. అప్పుడు ప్రారంభిస్తారట. గతంలో ఫటాఫట్ సినిమాలు తీసి చేతులు కాల్చుకొన్నాడు తేజు. ఇప్పుడు మాత్రం నిదానమే ప్రధానం అంటున్నారు. ఆచితూచి సినిమాలని ఎంచుకొంటున్నాడు. వాటిని నెమ్మదిగా పూర్తి చేసి.. ఫైనల్ గా హిట్ దక్కితే చాలనే పాలసీని ఫాలో అయిపోవాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.