పవన్ పోటీ చేయనున్న రెండు స్థానాలు.. ఇవే !


ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు స్థానాల నుంచి పోటీ చేయాలనే నిర్ణయం తీసుకొన్నారు. ఇప్పుడా రెండు స్థానాలని కూడా జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. విశాఖపట్నం జిల్లాలోని గాజువాక, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం స్థానాల్లో పవన్ పోటీకి దిగనున్నారు.

పవన్ పోటీ చేసే స్థానాలని అంత ఈజీగా ఎంపిక చేయలేదు. దీనికోసం జనసేన పార్టీ పెద్ద కసరత్తుయే చేసింది. ఆ పార్టీ జనరల్ బాడీ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో అనంతపురం, తిరుపతి, రాజానగరం, పిఠాపురం, భీమవరం, గాజువాక, పెందుర్తి, ఇచ్చాపురం స్థానాలని నుంచి పవన్ పోటీ చేస్తే పార్టీకి ఉపయుక్తంగా ఉంటుందని తేలింది.

ఈ ఎనిమిది స్థానాలపై అంతర్గత సర్వే జరిపించిన జనరల్ బాడీలోని మేధావులు, విద్యావేత్తులు, ఇతర రంగాల నిపుణులు భీమవరం, గాజువాక స్థానాల నుంచి పోటీ చేయాల్సిందిగా కోరారు. దాంతో పవన్ ఈ రెండు స్థానాల నుంచి పోటీకి రెడీ అవుతున్నారు. మరీ.. పవన్ పోటీ చేసిన రెండు స్థానాల నుంచి విజయం సాధిస్తారా.. ? లేదంటే అన్నయ్య మెగాస్టార్ లా రెండింటిలో ఒకదాంట్లో విజయం, మరోస్థానం నుంచి పరాజయం పొందుతారా.. ?? అన్నది చూడాలి.