తెరాస అభ్యర్థుల జాబితా.. నేడే విడుదల !

కాంగ్రెస్ అభ్యర్థులని ప్రకటించిన తర్వాతే.. తమ అభ్యర్థులని ప్రకటించాలని తెరాస నిర్ణయం తీసుకొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్తులు ఖరారయ్యారు. తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ సీట్లకు గానూ 16 స్థానాలకు కాంగ్రెస్‌ అభ్యర్థులను ఖరారు చేసింది. ఖమ్మం అభ్యర్థి ఎంపికను మాత్రం పెండింగ్‌లో ఉంచింది. ఈ నేపథ్యంలో తెరాస కూడా 16స్థానాలకి అభ్యర్థులని ప్రకటించేందుకు రెడీ అయ్యింది. నేడు నిజామాబాద్ లోని గిరిరాజ్ కళాశాల మైదానంలో జరిగే ఎన్నికల బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ వేదిక నుంచే తెరాస అభ్యర్థులని ప్రకటించనున్నట్టు తెలిసింది.

కాంగ్రెస్ మాదిరిగానే తెరాస కూడా 16స్థానాలకి అభ్యర్థులని ప్రకటించనుంది. ఖమ్మం స్థానాన్ని పెడింగ్ లో పెట్టనుందని సమాచారమ్. కాంగ్రెస్‌ నుంచి ఆ పార్టీ నేత రేణుకా చౌదరి ఖమ్మం టికెట్‌ ఆశిస్తుండగా.. తెరాస నుంచి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, నామా నాగేశ్వరరావు, రాజేంద్రప్రసాద్‌ టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు. వీరిలో ఎవరు ఖమ్మం టికెట్ దక్కించుకొంటారన్నది ఆసక్తిగా మారింది.