కోహ్లీ ఆకలితో ఉన్నాడు

విరాట్‌ కోహ్లీ ఇప్పటికే 66 శతకాలు బాదేశాడు. సింగిల్స్ తీసినంత ఈజీగా సెంచరీలు కొట్టేస్తున్నాడు. దీంతో సచిన్‌ వంద శతకాల
రికార్డుని కోహ్లీ చేస్తాడా ? అనే చర్చ జరుగుతోంది. సచిన్‌ రికార్డులను కోహ్లీ బద్దలు కొడతాడా అన్న ప్రశ్నకు కలిస్‌ తెలివిగా సమాధానం ఇచ్చారు. ‘ఆ ప్రశ్నకు విరాట్‌ మాత్రమే జవాబు ఇవ్వగలడు. అతడు కోరుకుంటే, అంత దూరం వెళ్లాలనుకుంటే అతడికి అందనివేమీ లేవు. అతనో అద్భుత ఆటగాడు. ఆకలితో ఉన్నాడు. కఠిన పరిశ్రమ చేస్తాడు. వరుసగా రాణిస్తున్నాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో అతనొకడు’ అని కలిస్‌ పేర్కొన్నాడు.

ఇక, ఈ నెల 23 నుంచి ఐపీఎల్ హంగామా మొదలు కానుంది. తొలి పోరు చైనై-బెంగళూరు జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ ని ప్రమోట్ చేసే పనిలో ఇరు జట్ల కెప్టెన్స్ ధోనీ, కోహ్లీ ఉన్నారు. వీరిద్దరు చేసిన యాడ్ టీవీల్లో తెగ ఆకట్టుకుంటోంది. కోహ్లీ, ధోని అనేది జస్ట్ పేర్లే కదా. అసలు మ్యాచ్ ఇంకా మొదలవ్వలేదని అంటున్నారు మాజీ, తాజా కెప్టెన్లు. మొత్తంగా తొలి మ్యాచ్ యే కాదు.. ఈ సీజన్ ఐపీఎల్ పండగా రసవత్తరంగా జరిగేలా కనబడుతోంది.