బ్రేకింగ్ : సగం మంది కొత్తవారితో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల లిస్టు

టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థుల ఎంపిక ఖరారైంది. మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థుల జాబితాని విడుదల చేయనున్నారు. ఈసారి సగం మంది కొత్తవారికి అవకాశం కల్పించినట్టు తెలిసింది. ముగ్గురు సిట్టింగులు పొంగులేటి, జితేందర్ రెడ్డి, సీతారామ్ నాయకులకి మరోసారి టికెట్ ఇచ్చేందుకు నిరాకరించినట్టు తెలుస్తోంది. మధ్యాహ్నం 12గంటల తర్వాత ప్రకటించిన అభ్యర్థులకి తెరాస బీ-ఫామ్ లని అందజేయనుంది. ఇక, రేపు మంచి ముహూర్తం ఉండటంతో తెరాస నేతలు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.