కారులోకి మరో ఇద్దరు కాంగ్రెస్ సీనియర్లు

తెలంగాణలో కాంగ్రెస్‌ నేతలు కారెక్కేందుకు క్యూ కడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పదిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెరాసలో చేరేందుకు రెడీ అయ్యారు. తాజాగా, మరో ఇద్దరు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్‌, పీసీసీ ఓబీసీ కమిటీ ఛైర్మన్‌ చిత్తరంజన్‌ దాస్‌ తమ పదవులకు, పార్టీ ప్రాథమిక సభ్యత్వాలకు రాజీనామా చేశారు. రాజీనామా లేఖలను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి పంపినట్లు నేతలు ఓ ప్రకటనలో తెలిపారు.

వీరిద్దరు కూడా త్వరలోనే తెరాసలో చేరబోతున్నట్టు సమాచారమ్. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజ్యసభలో రాపోలు ఆనంద భాస్కర్‌ చేసిన ప్రసంగాలు ప్రత్యేక ఆకర్షణ నిలిచాయి. కాంగ్రెస్ లో మంచి వాయిస్ ఉన్న నేతగా గుర్తింపు తెచ్చుకొన్నారు. రాపోలు కాంగ్రెస్ వీడటం.. ఆ పార్టీకి గట్టిదెబ్బనే చెప్పాలి. ఇక, రాపోలు తెరాసలో చేరితే.. ఆయన్ని మరోసారి రాజ్యసభకు పంపించే ఛాన్స్ ఉంది.