‘జెర్సీ’కి టేబుల్ ఫ్రాఫిట్

నేచురల్ స్టార్ నాని హీరో గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘జెర్సీ’. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మిస్తోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 19న జెర్సీ విడుదల కానుంది.

ఈ సినిమా కోసం రూ. 22 కోట్ల బడ్జెట్ ఖర్చుపెట్టారు. ఇంకా పబ్లిసిటీ మిగిలివుంది. ఆ ఖర్చుని కూడా కలుపుకొంటే రూ. 25కోట్లతో జెర్సీ రెడీ అయినట్టే. ఇప్పుడీ సినిమా మార్కెటింగ్ రెండు ఏరియాలు మినహా అంతా పూర్తయింది. థియేటర్ ఇంకా నాన్ థియేటర్ హక్కులు అన్నీకలిసి రూ. 40కోట్లకు పైగానే విక్రయించినట్లు తెలుస్తోంది. కృష్ణ, గుంటూరు ఏరియాలు మాత్రం నిర్మాతల దగ్గర వున్నాయి.

నాని రెమ్యూనిరేషన్ తీసుకోకుండా, ప్రాఫిట్ షేరింగ్ ప్రాతిపదికన చేయడం విశేషం. నానికి ప్రాఫిట్ షేరింగ్ కింద రెమ్యూనిరేషన్ కన్నా ఎక్కువ మొత్తమే వచ్చింది. తండ్రి కొడుకుల బంధం, క్రికెట్ నేపథ్యంలో సాగే జెర్సీ మీద మంచి అంచనాలే వున్నాయి.