మహేష్’తో మహేష్ !

సూపర్ స్టార్ మహేష్ బాబు మైనపు విగ్రహం త్వరలోనే సింగపూర్ లోని ‘మేడమ్ టుస్సాడ్స్’లో కొలువుదీరబోతోన్న సంగతి తెలిసిందే. అంతకంటే ముందే మహేశ్ బాబు మైనపు బొమ్మను హైదరాబాద్ కి తీసుకొచ్చారు. మహేష్ థియేటర్ ‘ఏఎమ్ బీ సినిమాస్’లో ఉంచారు. ఈ కార్యక్రమం కొద్దిసేపటి క్రితమే ప్రారంభం అయింది. మహేష్ ఫ్యామిలీ మహేష్ మైనపు బొమ్మతో ఫోటోలు దిగింది.

దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహేష్ మైనపు బొమ్మ పక్కన మహేష్ నిలబడి దిగిన ఫోటోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహేష్ తో మహేష్. ఇద్దరు మహేష్ లు. సూపర్ స్టార్స్ అనే కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్. మరొకొద్దిరోజులు మహేష్ మైనపు బొమ్మ ‘ఏఎమ్ బీ సినిమాస్’లో ఉండనుంది. అభిమానులు వెళ్లి సెల్ఫీలు తీసుకోవచ్చు.

ప్రస్తుతం మహేష్ ‘మహర్షి’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి వంశీపైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. దిల్ రాజు-పివిపి-అశ్వినీదత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మే 9న మహర్షి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మహేష్ తదుపరి సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనుంది.