తెరాస16, కాంగ్రెస్ 6 స్థానాలు


తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు గానూ 16స్థానాల్లో గెలవాలనే లక్ష్యాన్ని పెట్టుకొంది తెరాస. ఒక్క హైదరాబాద్ లోక్ సభ స్థానాన్ని మాత్రం దోస్తానా పార్టీకి ఎంఐఎంకు విడిచి పెట్టింది. అక్కడ ఆ పార్టీ అధినేత అసరుద్దీన్ ఓవైసీ భారీ మెజారిటీతో గెలుస్తాడని గులాభి పార్టీ భావిస్తోంది. ఇక, అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి షాక్ తగిలిన తెలంగాణ కాంగ్రెస్ కాళ్లు ఈసారి భూమిమీదకొచ్చాయి

ఈసారి ఆ పార్టీ ప్రాక్టీకల్ గా ఆలోచిస్తోంది. కేవలం 6స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకొంది. మల్కాజిగిరి, చేవెళ్ల, నల్గొండ, భువనగిరి, ఖమ్మం, మహబూబాబాద్‌ స్థానాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే లక్ష్యంతో తెలంగాణ కాంగ్రెస్ కార్యాచరణను సిద్ధం చేసుకుంది. ఈ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరించిన పార్టీ అధిష్ఠానం ఎన్నికల్లోనూ వ్యూహాత్మకంగా వెళ్లాలని నిర్ణయించుకుంది.