ఢిల్లీ ‘వర్సెస్’ చెన్నై : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్న ఢిల్లీ

ఐపీఎల్ 12 సీజన్ లో ఇవాళ ఢిల్లీ వేదికగా ఢిల్లీ-చైన్నై జట్ల మధ్య మ్యాచ్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన ఢిల్లీ మొదట బ్యాటింగ్ ఎంచుకొంది. సెకండ్ ఇన్నింగ్స్ లో బంతి గ్రిప్పింగ్ మిస్ అవుతుంటుంది.. అందుకే మొదటి బ్యాటింగ్ ఎంచుకొన్నట్టు ఢిల్లీ కెప్టెన్ శ్రియాస్ అయ్యార్ తెలిపారు. ఇక, తాము టాస్ గెలిచి ఉంటే కచ్చితంగా ఫీల్డింగ్ ఎంచుకొనేవాళ్లమని ధోని తెలపడం విశేషం. ఢిల్లీలో ఇదే తొలి మ్యాచ్. పిచ్ ఎలా ప్రవర్థిస్తుందో తెలీదు. అందుకే తాము టాస్ గెలిస్తే ఫీల్డింగ్ ఎంచుకొనేవాళ్లం అన్నారు.

ఇక మ్యాచ్ లో అందరి దృష్టి ధోని, రిషిబ్ పంత్ పైనే నెలకొంది. ధోని వ్యూహాలు వర్సెస్ పంత్ పంచ్ లు అభివర్ణిస్తున్నాయి. ధోని ఆదర్శంగా తీసుకొని క్రికెటర్ గా ఎదిగిన రిషబ్ పంత్ గత మ్యాచ్ లో సంచలన ఇన్నింగ్స్ ఆడారు. ఈసారి కూడా అదే రేంజ్ లో రాణిస్తే.. ఢిల్లీ విజయం సాధించే ఛాన్స్ ఉంది. ఐతే, పంత్ కి చక్కటి వ్యూహాం పన్నే ఉంటాడు ధోని అని కామెంట్స్ వినిపిస్తున్నాయి