నేడు వైసీపీలో చేరబోతున్న మోహన్ బాబు

నటుడు మోహన్ బాబు కుటుంబంపై టీడీపీ వ్యతిరేక ముద్రపడిపోయింది. ఇటీవల తిరుపతిలో మోహన్ బాబు నిర్వహించిన నిరసన ర్యాలీతో అది స్పష్టమైంది. ఈ నేపథ్యంలో మోహన్ బాబు కుటుంబం సైతం ఓపెన్ అయింది. జగన్ కు బాహాటంగానే మద్దతు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే మోహన్ బాబు కోడలు, మంచు విష్ణు భార్య.. ‘జగన్ నా అన్న. నా రక్తం’ ఆయన గెలుపుకోసం కచ్చితంగా ప్రయత్నిస్తానని ట్విట్ చేశారు. ఇప్పుడు ఏకంగా మోహన్ బాబు రంగంలోకి దిగబోతున్నారు.

ఆయన ఇవాళ జగన్ కలబోతున్నారు. అంతేకాదు.. జగన్ సమక్షంలో వైసీపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ అభ్యర్థలని ఖరారు చేసింది. దీంతో మోహన్ బాబు పోటీకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి. ఐతే, జగన్ గెలుపుకోసం మోహన్ బాబు ప్రచారం చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ వైకాపా అధికారంలోకి వస్తే.. అప్పుడు ఆయనకి రాజ్యసభలాంటి నామినేటేడ్ పోస్ట్ దక్కే అవకాశాలున్నాయి.