ఐపీఎల్12 : ఢిల్లీపై చెన్నై గెలుపు

ఐపీఎల్‌-12లో చెన్నై రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ధోని జట్టు 6 వికెట్ల తేడాతో దిల్లీ క్యాపిటల్స్‌పై గెలిచింది. డ్వేన్‌ బ్రావో (3/33)తో పాటు ఇతర బౌలర్లు రాణించడంతో మొదట దిల్లీ 147/6కే పరిమితమైంది. శిఖర్‌ ధావన్‌ (51; 47 బంతుల్లో 7×4), రిషబ్‌ పంత్‌ (25; 13 బంతుల్లో 2×4, 1×6) రాణించారు.

లక్ష్యం 148 మాత్రమే అయినా విజయం తేలిగ్గానైతే దక్కలేదు. మందకొడి ఫిరోజ్‌ షా కోట్లాలో లక్ష్యాన్ని ఛేదించడానికి చెన్నై చెమటోడ్చింది. చివరి 3 ఓవర్లలో 22 పరుగులు చేయాల్సిన స్థితి ఏర్పడింది. చివరి ఓవర్లో రెండు పరుగులు అవసరం కాగా.. రబాడ వాటిని అంత తేలిగ్గా ఇవ్వలేదు. తొలి బంతికి జాదవ్‌ను ఔట్‌ చేసిన అతను.. తర్వాతి రెండు బంతులకు పరుగే ఇవ్వకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. ఐతే ఐదో బంతికి బ్రావో ఫోర్‌ కొట్టి మ్యాచ్‌ను ముగించాడు.