వైకాపాని వణికిస్తున్న కెఏ పాల్

ఏపీ రాజకీయాల్లో కెఏ పాల్ కమెడియన్ గా అనిపించారు. ఆయన విచిత్ర చేష్టలు హీటెక్కిన రాజకీయాల్లో నవ్వులు పూయించాయి.
నవ్వులు పండిన సినిమా సూపర్ హిట్ అయినట్టు.. ఏపీ రాజకీయాల్లోనూ కెఏ పాల్ హిట్ అయ్యేలా కనిపిస్తున్నారు. ప్రధాన పార్టీలు టీడీపీ, వైకాపా అభ్యర్థులని ఓడించేలా పాల్ పార్టీ సరికొత్త రాజకీయానికి తెర లేపింది. ఐతే, ఇది పాల్ స్ట్రాటజీ కాదు. టీడీపీ స్ట్రాటజీ.

కెఏ పాల్ సాయంతో వైకాపాని దెబ్బకొట్టే ప్లాన్ వేసింది టీడీపీ. ప్రజాశాంతి పార్టీ ఎన్నికల గుర్తు విమానం. అది వైకాపా ఎన్నికల గుర్తు ఫ్యాన్ ని పోలీ ఉంది. దీనిపై ఇప్పటికే వైకాపా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఫ్యాన్, విమానం గుర్తుల సారుప్యతని టీడీపీ తెలివిగా వాడుకొంటోంది. తమ అభ్యర్థులకి ప్రజాశాంతి పార్టీ తరుపున టికెట్లు ఇప్పించింది.

అంతేకాదు.. వైకాపా అభ్యర్థుల పేర్లని పోలిన అభ్యర్థులని బరిలోకి దించుతోంది. దీంతో గ్రామీణ ఓటర్లని కన్ఫూజన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ నేమ్.. గేమ్ తో వృద్ద ఓటర్లు గందరగోళానికి గురయ్యే ఛాన్స్ ఉంది. తెలంగాణలో కారు గుర్తు ఓట్లకి గండికొట్టిన ట్రక్కు గుర్తు మాదిరిగా ఏపీలోనూ ఫ్యాన్ ఓట్లకి గండికొట్టేందుకు విమానం గుర్తుతో అభ్యర్థులని పోటీకి దించుతోంది. ఇందుకోసం వైకాపా అభ్యర్థుల పేర్లతో పోలీవున్న అభ్యర్థుల బరిలోకి దించారు. ఇది నిజంగా వైకాపాని వణికించే మేటరు. దీనిపై ఆ పార్టీ రియాక్షన్ ఏంటీ? అన్నది చూడాలి.