ఇదీ.. సెలబ్రేట్ చేసుకొనే పిక్ !

‘మహర్షి’ మ్యూజికల్ జర్నీ మొదలుకాబోతుంది. రేపు (మార్చి 29) ఉదయం 9:9నిమిషాలకు మహర్షి తొలి సాంగ్ #ChotiChotiBaatein విడుదల కానుంది. మీ ఫ్రెండ్ షిప్ ని సెలబ్రేట్ చేసుకొనేందుకు రెడీగా ఉండండి.. అంటూ దర్శకుడు వంశీపైడిపల్లి ట్విట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా షేర్ చేసిన ‘మహర్షి’ ఫోస్టర్ లో మహేష్, పూజా హెగ్డే, అల్లరి నరేష్ లు సముద్రం ఒడ్డున నిల్చొని ఉన్నారు. తాజాగా, వంశీ కొత్త పోస్టర్ ని విడుదల చేశారు. ఇదీ.. అసలైన స్నేహానికి అద్దపడుతోంది.

ఈ పోస్టర్ ని హీరోయిన్ పూజా హెగ్డే రీ-ట్విట్ చేసింది. ‘స్నేహితులతో గడిపిన తీపి గుర్తులు లేని జీవితం ఎందుకు?’ అంటూ కామెంట్ పెట్టారు. ఇక పోస్టర్ లో మహేష్, పూజా, అల్లరోడు చిరు నవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు. అంతేకాదు.. ఈ పోస్టర్ లో మహేష్-పూజా జోడీ అద్భుతంగా కుదిరినట్టు కనబడుతోంది. ఇటీవల కాలంలో మహేష్ పక్కన ఇంత బాగా సెట్ అయిన హీరోయిన్ లేదేమో.. !