కేసీఆర్ సెంటిమెంట్’పై కొట్టిన మోడీ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సెంటిమెంట్లు ఎక్కువే. ఆయన జ్యోతిష్యాన్ని బలంగా నమ్ముతున్నారు. ఏం చేసిన పక్కా ముహూర్తంలోనే చేస్తారు. అది ఆయనకు మంచి చేస్తోంది కూడా. టైం బలం చూసుకొనే కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో ముందస్తుకెళ్లారు. చివరికి మంత్రివర్గ కూర్పునకు కూడా ముహూర్త బలం చూసుకొన్నారు. ఇందుకోసం మంత్రివర్గ విస్తరణను ఏకంగా మూడ్నేళ్లు వాయిదా వేశారు. ముహూర్తం బలం ఒక్కటే కాదు. సంఖ్యాబలాన్ని నమ్ముతారు కేసీఆర్. ఈ విషయం అందరికీ తెలుసు.

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ప్రధాని తెలంగాణ రాష్ట్రానికి విచ్చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌లో జరిగిన భాజపా భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. సీఎం కేసీఆర్ సెంటిమెంట్స్ పై తీవ్ర విమర్శలు చేశారు.
జ్యోతిష్యుడు చెప్పడం వల్లే కేసీఆర్‌.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలను ఎందుకు ముందస్తుగా నిర్వహించారని, మంత్రివర్గ కూర్పునకు కూడా అతణ్నే సంప్రదిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెరాస, కాంగ్రెస్‌ లక్ష్యంగా ప్రధాని విమర్శలు గుప్పించారు.