భారీ షెడ్యూల్ కోసం వడోదర బయలుదేరిన #RRR టీమ్

ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా రాజమౌళి మల్టీస్టారర్ #RRR తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకొంది. మూడో షెడ్యూల్ కోసం చిత్రబృందం వడోదరకు బయలుదేరి వెళ్లింది. ఈ తెల్లవారుజామున తారక్, చరణ్ లతో కలిసి రాజమౌళి ఫ్లైట్ ఎక్కేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ తారక్ ట్విట్ చేయడం విశేషం.ఫ్లైట్ టికెట్స్ ని కూడా షేర్ చేశాడు. బిగ్ షెడ్యూల్ కోసం వడోదర వెళ్తున్నట్టు తెలిపారు తారక్.

అల్లూరి సీతారామరాజు, కొమరం భీంల కథ ఇది. వీరిద్దరిలో ఉన్న ఓ కామన్ పాయింట్ ఆధారంగా సినిమా తెరకెక్కిస్తున్నామని రాజమౌళి తెలిపారు. అల్లూరిగా రామ్ చరణ్, కొమరంభీమ్ గా తారక్ కనిపించబోతున్నారు. చరణ్ కి జంటగా బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ జతకట్టనుంది. తారక్ కి జంటగా హాలీవుడ్ హీరోయిన్ డైసీ ఎడ్గర్ జోన్స్ నటించనుంది. బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయనతో పాటు మరో ఇద్దరు బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, వరుణ్ ధావన్’లని తీసుకొన్నారని టాక్.


వడోదర షెడ్యూల్ లో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ షూటింగ్ లో పాల్గొనబోతున్నారని సమాచారమ్. హీరోయిన్స్ కూడా ఈ షెడ్యూల్ కోసం వస్తారని చెబుతున్నారు. ఐతే, ఈ షెడ్యూల్ మధ్యలో వారు జాయిన్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ చిత్రానికి ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. దాదాపు రూ. 400కోట్ల బడ్జెట్ తో డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాహుబలి రేంజ్ లో #RRRని విడుదల చేయబోతున్నారు. 2020 జులై 30న #RRR ప్రేక్షకుల ముందుకు రానుంది.