పంజాబ్’ని గెలిపించిన రాహుల్

సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ముంబయి ఇండియన్స్‌ను ఘోరంగా ఓడించింది. టాస్ గెలిచి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.
ముంబయిలో డికాక్‌ (60), రోహిత్‌ శర్మ (32), హార్దిక్‌ పాండ్య (31) రాణించారు.

177 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్‌ 2 వికెట్లు నష్టపోయి 18.4 ఓవర్లలోనే ఛేదించింది. ఆ జట్టు ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (71; 57 బంతుల్లో 6×4, 1×6) అర్ధశతకంతో అజేయంగా నిలిచాడు. కడవరకు నిలిచి ‘కింగ్స్‌’ను గెలుపుబాట పట్టించాడు. క్రిస్‌గేల్‌ (40; 24 బంతుల్లో 3×4, 4×6), మయాంక్‌ అగర్వాల్‌ (43; 21 బంతుల్లో 4×4, 2×6) మెరుపులు మెరిపించారు.