బాబు ముద్దు.. మోడీ వద్దు !

ఏపీలో జాతీయ నేతలతోనూ ప్రచారం చేయిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇటీవలే ఢిల్లీ ముఖ్యమంత్రి క్రేజీవాల్ చంద్రబాబుతో కలిసి ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. బాబుతోనే ఏపీ అభివృద్ధి. ఆయన్ని మరోసారి గెలిపించడని ఆంధ్రా ప్రజలకి విజ్ఝప్తి చేశారు ఢిల్లీ సీఎం. తాజాగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జినీ ఏపీకి తీసుకొచ్చారు బాబు.

ఆదివారం రాత్రి విశాఖ మున్సిపల్‌ మైదానంలో నిర్వహించిన తెదేపా ఎన్నికల బహిరంగ సభలో దీదీ పాల్గొని ప్రసంగించారు. చంద్రబాబుతోనే ఏపీ అభివృద్ధి ముడిపడి ఉంది. ఆయన మళ్లీ వస్తేనే ఏపీ అభివృద్ధి చెందుతుందని.. ప్రజలు ఆలోచించి ఓటేయాలని దీదీ సూచించారు.

గత ఎన్నికల్లో మోదీ చాయ్‌వాలా అన్నారు. ఇప్పుడు చౌకీదార్‌ అంటున్నారని, ఆయన ప్రజలకు కాదు.. దోపిడీ దారులకు కాపలాదారు అని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీని సాగనంపితేనే దేశానికి భద్రత అన్నారు. రాజ్యాంగాన్ని, వ్యవస్థను మార్చేందుకు భాజపా నేతలు యత్నిస్తున్నారని దీదీ ఆరోపించారు.