వైసీపీలో చేరిన జీవిత-రాజశేఖర్


సినీ దంపతులు జీవిత, రాజశేఖర్ వైసీపీలో చేరారు. ఈ ఉదయం లోటస్ పాండ్’కు వెళ్లి జగన్ ని కలిసిన జీవిత-రాజశేఖర్ దంపతులు.. కొద్దిసేపటికే పార్టీలో వైసీపీలో చేరిపోయారు. వీరికి జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జీవితారాజశేఖర్ మీడియోతో మాట్లాడుతూ.. “జగన్ చాలా ప్రేమించదగినవాడు. చంద్రబాబును సూపర్ అన్న టైంలో వైఎస్సార్ వచ్చి తాను సూపర్ డూపర్ అని నిరూపించారు. ఆ విధంగానే జగన్ కూడా మామూలు బిడ్డ కాదు. పులి బిడ్డ” అన్నారు.

ప్రజల కోసం సేవ చేయాలనే కసితో జగన్ ఉన్నారు. ఆయన ఎలాంటి సుఖం కోరుకోవడం లేదు. ప్రజాసేవ కోసం పరితపిస్తున్నారు.
ఇప్పటి వరకూ జగన్‌ను కలవకుండా తప్పు చేశానని భావిస్తున్నాని రాజశేఖర్ అన్నారు. జగన్‌తో కలిసి న్యాయంగా పని చేస్తూ, న్యాయమైన పోరాటం చేస్తాం. డబ్బు కోసం ఆశపడి తాము పని చేసింది లేదు. చేయబోమని జీవిత, రాజశేఖర్ దంపతులు తెలిపారు. జగన్‌తో కలిసి న్యాయంగా పని చేస్తూ, న్యాయమైన పోరాటం చేస్తామన్నారు.

జీవితారాజశేఖర్ కి ఫైర్ బ్రాండ్ గా పేరుకొంది. ఇప్పటికే వైసీపీలో రోజా రూపంలో ఓ ఫైర్ బ్రాండ్ ఉంది. ఇప్పుడు జీవిత రాకతో రోజా ఇమేజ్ ఏమైనా డ్యామేజ్ అవుతుందా.. ? భవిష్యత్ లో రోజాని వదిలించుకోవాలనే ఆలోచన జగన్ కి ఏమైనా ఉందా ? అనుమానాలు కలుగుతున్నాయి. దానికి భవిష్యత్ యే సమాధానం చెప్పాలి. ఏదేమైనా రోజా కాస్త జాగ్రత్త పడితే మంచిదేమో !