‘మజిలీ’ ట్రైలర్ టాక్

సమంత-నాగ చైతన్య జంటగా నటిస్తున్న చిత్రం ‘మజిలీ’. శివ నిర్వాణ దర్శకుడు. పెళ్లి తర్వాత చై-సామ్ నటిస్తున్న తొలి చిత్రమిది. ఏప్రిల్ 5న మజిలీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదివారం హైదరాబాద్ లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. వెంకటేష్, నాగార్జున ముఖ్య అథిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్ విడుదల చేశారు.

ఎమోషన్స్ సీన్స్ తో కట్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ‘సిగ్గుండాలిరా.. పెళ్లాం దగ్గర డబ్బులు తీసుకోవడానికి.. తినే తిండి.. కట్టుకునే బట్ట.. ఆఖరికి తాగే మందు కూడా భార్య సంపాదన మీదే..?’’ అంటూ రావు రమేశ్‌ నాగచైతన్యను తిడుతున్న డైలాగ్‌తో ట్రైలర్‌ ప్రారంభమైంది. ‘‘వైజాగ్‌లో పెళ్లాలు.. మొగుళ్లను మాయ్యా అంటారు’’ అని నాగచైతన్య చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. మొత్తంగా ట్రైలర్ ఎమోషనల్ సాగింది. మజిలీ ఎమోషనల్ ట్రైలర్ ని మీరు ఓ సారీ చూసేయండీ.. !