పవన్ కోసం మాయవతి ప్రచారం.. షెడ్యూల్ ఖరారు !

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు దారిలోనే వెళ్తున్నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. చంద్రబాబు జాతీయ నేతలని ఏపీకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫరూక్ అబ్దుల్లా, క్రేజీవాల్, మమతాబెనర్జీలు టీడీపీ తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇప్పుడు పవన్ కూడా మాయవతిని రంగంలో దించబోతున్నారు. జనసేన బీఎస్పీతో పొత్తుపెట్టుకొన్న సంగతి తెలిసిందే
ఆ పార్టీకి ఏకంగా 21స్థానాలని కేటాయించింది. ఈ నేపథ్యంలో మాయమతి ఏపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

దీనికి సంబంధించి షెడ్యూల్ కూడా ఖరారైంది. మంగళవారం రాత్రి మాయవతి విశాఖ చేరుకొంటారు. బుధవారం నుంచి ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. బుధవారం ఉదయం విశాఖలో మాయవతి ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. అదే రోజు సాయత్రం విజయవాడలోని అజిత్ సింగ్ నగర్‌‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో భారీ బహిరంగసభలో పాల్గొననున్నారు.
గురువారం ఉదయం తిరుపతిలో బహిరంగ సభలో పాల్గొంటారు. అదే రోజు సాయత్రం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో పవన్ కల్యాణ్‌తో కలిసి బహిరంగసభలో పాల్గొననున్నారు. మరీ.. మాయవతి వలన జనసేనకి ఏ మేరకు మైలేజీ వస్తుందన్నది చూడాలి.