సమంత క్రేజ్’ని వాడుకోవాలని.. !


నాగ చైతన్య, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ‘మజిలీ’. శివ నిర్వాణ దర్శకుడు. పెళ్లి తర్వాత సామ్-చై తొలిసారి నటిస్తున్న చిత్రమిది. వీరు సినిమాలోనూ భార్యభర్తలు నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. సినిమాపై క్రేజ్ ని పెంచాలనే ఆలోచనతో హీరోయిన్ గా సమంతని తీసుకొన్నారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆదివారం జరిగిన మజిలీ ప్రీ-రిలీజ్ వేడుకలో దర్శకుడు క్లారిటీ ఇచ్చారు.

ఇందులో చైతూ పూర్ణ పాత్రలో కనిపిస్తారు. సమంత శ్రావణి పాత్రలో కనిపిస్తుంది. పూర్ణని భరించేంత శక్తి, సామర్థ్యం, కెపాసిటీ, ప్రేమ.. సమంతలో ఉన్నాయి. అందుకే.. ఆమెని తీసుకొన్నాం. ఏదో సమంతని తీసుకొంటే సినిమాకి క్రేజ్ వస్తుందని ఆమెని తీసుకోలేదన్నారు దర్శకుడు. అంతేకాదు.. సినిమాలో సమంత నటన అద్భుతం. వందశాతం న్యాయం చేసింది. ఐతే, సినిమాపై చైతూ నటన ప్రేక్షకులకి షాక్ ఇస్తుంది. ఆ రేంజ్ లో చైతూ నటన ఉంటుందని చెప్పుకొచ్చాడు.