ఉగాధి కానుకగా సంక్రాంత్రి సినిమా.. !


ఉగాధి కానుకగా సంక్రాంత్రి సినిమా రాబోతుంది. ఈ యేడాది సంక్రాంత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ఎఫ్ 2’ సూపర్ హిట్ అయ్యింది. అసలైన సంక్రాంత్రి అనిపించుకొంది. ఏకంగా రూ. 100పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. అత్యధిక లాభాలు తీసుకొచ్చిన తెలుగు సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడీ సినిమా ఉగాధి కానుకగా బుల్లితెరపై ప్రసారం కానుంది. ఆదివారం సాయంత్రం 6గంటలకు ‘స్టార్ మా’లో ‘ఎఫ్ 2’ ప్రసారం కానుంది.

ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. వెంకటేష్-తమన్నా, వరుణ్ తేజ్-మెహ్రీన్ లు జంటగా నటించారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. దిల్ రాజు నిర్మించారు. ఇప్పుడీ సినిమా బాలీవుడ్ లో రిమేక్ కానుంది. బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు బాలీవుడ్ ఎఫ్ 2ని నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా పూర్తి వివరాలు తెలియరానున్నాయి.