‘చిత్రలహరి’ జ్యూక్ బాక్స్ వచ్చేసింది

‘చిత్రలహరి’లో తొలి పాట ‘పరుగు పరుగు.. ‘ని ప్రేక్షకులు వినేశారు. రెండో పాట ‘గ్లాస్ మేట్స్.. ‘ ప్రేక్షకులని అమితంగా ఆకట్టుకొంది. ఇప్పుడు ‘చిత్రలహరి’లోని మిగితా పాటలు కూడా ప్రేక్షకులు వినేయొచ్చు. అదేనండీ.. చిత్రలహరి జ్యూక్ బాక్స్ వచ్చేసింది. మొత్తం నాలుగు పాటలతో చిత్రలహరి ఆల్భమ్ ని కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు.

ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. సాయి తేజు సరసన కళ్యాణి ప్రియదర్శన్, నివేత పేతురాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఏప్రిల్ 12న చిత్రలహరి ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రలహరి ఎమోషనల్ ఎంటర్ టైనర్. ఈ చిత్రంలో ప్రేమ మాత్రమే కాదు.. తండ్రీ కొడుకుల మధ్య జరిగే సంఘర్షణ కూడా ఉంది. ప్రతి ఒక్క నిరుద్యోగ యువత ఈ చిత్రంతో కనెక్ట్ అవుతారని చిత్రబృందం చెబుతోంది.