బ్రహ్మీపై ఆ.. ఆరోపణలు నిజమే !

బ్రహ్మానందం గురించి గతంలో భయంకరమైన ప్రచారం జరిగింది. ఆయనకు అహం ఎక్కువ. తాను లేనిదే సినిమా లేదు అన్నట్టుగా వ్యవహరిస్తారు. సినిమాలో నటించేందుకు భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే దర్శక-నిర్మాతల
ని భయపెట్టేస్తారు. అంతేకాదు.. తోటి కమెడియన్స్’ని తొకేయడానికి ప్రయత్నిస్తారనే భయంకర ప్రచార జరిగిన సంగతి తెలిసిందే.

ఈ ప్రచారంలో కొన్ని నిజాలు ఉన్నాయని తాజాగా బ్రహ్మానందం స్వయంగా ఒప్పుకొన్నారు. ఆయనకి ఇటీవలే గుండెకు సంబంధించిన ఆపరేషన్ జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బ్రహ్మీ ఇంట్లో విశ్రాంతి తీసుకొంటున్నారు. ఇటీవలే మజిలీ చిత్రబృందంతో కలిసి బ్రహ్మీ తిరుమల శ్రీవారిని దర్శించుకొన్నారు. ఈ విషయం పక్కన పెడితే.. గుండే ఆపరేషన్ తర్వాత బ్రహ్మీకి జ్జానోదయం అయినట్టు కనబడుతోంది. ఇటీవల ఆయన ఓ దినపత్రికకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఇందులో కొన్ని నిజాలు ఒప్పుకొన్నారు. గతంలో తాను భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసి దర్శక-నిర్మాతలని భయపెట్టిన మాట నిజమే. గుండే ఆపరేషన్ తర్వాత నాకు జ్ఝానోదయం అయ్యింది. నాకు ఆరోగ్యం బాగోలేదని తెలిసి.. కొందరు అభిమానులు ఆలయాలలో ప్రత్యేక పూజలు చేశారు. తాను కోలుకోవాలని ఆకాంక్షిస్తూ టన్నుల కొద్ది మెసేజ్ లు పెట్టారు. తన అనారోగ్యం తన అజ్ఞానాన్ని తోలిగించింది. ఇకపై డబ్బుకోసం కాదు ప్రేక్షకులని నవ్వించడానికి మాత్రమే సినిమాలు చేస్తానన్నారు బ్రహ్మీ.

తన రీ-ఎంట్రీ సినిమా కూడా ఓకే అయింది. రచయిత శ్రీధర్ సిపాన వ్రాసిన కథతో రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నా. ‘రేసుగుర్రం’ మూవీలోని కిల్ బిల్ పాత్ర టైపులో తన పాత్ర ఉంటుంది. ఈ సినిమాలో నవ్వకుండా సీరియస్ గా ఉంటానని తన పాత్రను చూసి ప్రేక్షకులు తెగ నవ్వుతారు తెలిపారు బ్రహ్మా. ఈ సినిమాకు ‘బ్రహ్మీ ఈజ్ బ్యాక్’ అనే టైటిల్ పెట్టే ఆలోచన ఉన్నట్టు తెలిపారు.