‘చిత్రలహరి’ ట్రైలర్ టాక్

చిత్రలహరి’లోని మొత్తం నాలుగు పాటలు వినేశాం. అంతకుముందు టీజర్ కూడా చూసేశాం. ఇప్పుడు చిత్రలహరి ట్రైలర్ కూడా వచ్చేసింది. మెగా యంగ్ హీరో సాయి తేజ్ తాజా చిత్రం ‘చిత్రలహరి’. కిషోర్ తిరుమల దర్శకుడు. కళ్యాణి ప్రియదర్శన్, నివేత పేతురాజ్ హీరోయిన్స్. ఏప్రిల్ 12న చిత్రలహరి ప్రేక్షకుల ముందుకు రానుంది. శనివారం హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఐతే, ప్రీ-రిలీజ్ వేడుక వేదికగా ట్రైలర్ ని విడుదల చేయలేదు. కొద్దిసేపటి క్రితమే ట్రైలర్ ని వదిలారు.

“నా పేరు విజయ్ నా పేరులో ఉన్న జీవితంలోకి ఎప్పుడొస్తుందా.. అని ఐయామ్ వెయిటింగ్” అని తేజు చెబుతుండటంతో ట్రైలర్ మొదలైంది. ఉద్యోగం కోసం తేజు బగీరథ ప్రయత్నాలు, ఆ తర్వాత గ్లాస్ మేట్ సునీల్ తో పెగ్గేసే సన్నివేశాలు చూపించారు. ‘ఇంట్లో కూర్చుంటే గంటలో రావడానికి.. సక్సెస్ టైం పడుతుంది’, ‘ఓడిపోవడం అనేది మనోడుకి వెన్నతో పెట్టిన విద్య’, ‘ఒకే దిక్కు ఉదయించే సూర్యడు నాలుగు దిక్కులు ఉదయించినా.. ఇంత వెలుతురు రానీ జీవితం నాది. ఎందుకంటే? చీకటికి చిరునామా నేను” అనే డైలాగ్స్ బాగా పేలాయి. ఆఖరిలో ప్లేట్ సక్సెస్ కావాలని తేజు అడగటం ఆకట్టుకుంటోంది. మొత్తంగా చిత్రలహరి ట్రైలర్ అదిరిపోయింది.