కేసీఆర్‌తో స్నేహమంటే పులిపై స్వారీ చేసినట్టే

ఏపీ కోసం పీక కోసుకొనే బాపత్ హీరో శివాజీ. పైకి ఆంధ్రపదేష్ అభివృద్ధియే నా లక్ష్యమని చెబుతున్న శివాజీ ఒంట్లో పచ్చ రక్తం ప్రవహిస్తున్నట్టుంది. ఎన్నికల వేళ ఆ పసుపు రక్తం మరోసారి ఎరుపెక్కింది. దీంతో కేసీఆర్, జగన్ లపై సంచలన ఆరోపణలు చేశారు శివాజీ. తెలంగాణ అవసరాల కోసం వాన్‌పిక్ భూముల్లో ప్రైవేట్ పోర్టును నిర్మించాలన్నది సీఎం కేసీఆర్ ప్రయత్నం. దీనికి జగన్ సపోర్ట్ ఉంది. ఏపీలో జగన్ గెలిస్తే.. ఆయన కేసీఆర్ తో కలిసి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని అడ్డుకొంటారని ఆరోపించారు శివాజీ.

‘నిజం విత్‌ శివాజీ’ పేరిట హీరో శివాజీ విజయవాడలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సరైన వ్యక్తి అధికారంలోకి రాకపోతే ఈ ప్రాజెక్టును తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆపేస్తారని ఆరోపించారు. జగన్‌పై కేసీఆర్‌కు నిజంగా ప్రేమ ఉందని అనుకోనని, ఆయన ఆడుతున్న పన్నాగాల్లో చిక్కుకోవద్దని హితవు పలికారు. కేసీఆర్‌తో స్నేహమంటే పులిపై స్వారీ చేసినట్లేనని వ్యాఖ్యానించారు. మొత్తంగా.. శివాజీ బయటపెట్టిన ‘ఆపరేషన్ గరుడ’ నిజమైందని ఏపీ ప్రజలు నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో శివాజీ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యతని సంతరించుకొన్నాయి. దీనిపై జగన్, కేసీఆర్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది అన్నది చూడాలి.