రాజస్థాన్’పై కోల్‌కతా ఈజీ విన్


కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ నాల్లో విజయాన్ని ఖాతాలో వేసుకొంది. ఆదివారం జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్‌ రాయల్స్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. స్టీవెన్‌ స్మిత్‌ 73, జాస్‌ బట్లర్‌ 37 పరుగులతో రాణించారు. కోల్‌కతా బౌలర్లలో హ్యారీ గుర్నే2, ప్రసిద్‌ కృష్ణ ఒక వికెట్‌ తీశారు.

140 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా రెండు వికెట్లు కోల్పోయి 36 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఓపెనర్లు క్రిస్‌లిన్‌ 50, సునీల్‌నరైన్‌ 47 చెలరేగి ఆడారు. వీరిద్దరు అవుటైన తర్వాత.. రాబిన్‌ ఉతప్ప 25, శుభ్‌మన్‌గిల్‌ 6 పరుగులు చేసి జట్టుని విజయతీరాలకి చేర్చారు. ఇది కోల్ కతాకి చాలా ఈజీ విన్.