శోభన్‌బాబు.. చైతూ రూపంలో వచ్చాడా ?


నాగచైతన్య ఈ తరం శోభన్ బాబు. ‘మజిలీ’ సినిమా చూసిన తర్వాత వినిపిస్తున్న కామెంట్స్ ఇవి. నాగచైతన్య-సమంత భార్యభర్తలు
గా నటించిన చిత్రం ‘మజిలీ’. దివ్యాంశ కౌశిక్‌ మరో కథానాయిక. శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మాతలు. ఉగాది కానుకగా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ఆదివారం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించింది.

ఈ సందర్భంగా మాట్లాడిన పోసాని కృష్ణమురళీ చైతూ ఈ తరం శోభన్ బాబు అన్నారు. “ఈ సినిమా చూశాక చైతు ఇంత గొప్పగా నటిస్తాడా అని ఈర్ష్య కలిగింది. శోభన్‌బాబు… చైతూ రూపంలో వచ్చాడా అనిపించింది. చైతూ మంచివాడు. అతనిలో గొప్ప నటుడు ఉన్నాడని తెలుసుకొన్నా. కుటుంబ కథల్ని ఇలా కూడా తీయొచ్చని శివ నిరూపించాడు’’ అన్నారు. ఇది నిజంగా చైతూకి గొప్ప ప్రశంస.