రైతుబంధు రెండో విడత చెక్కులు రెడీ

తెలంగాణ రైతులకి గుడ్ న్యూస్. రెండో విడత రైతుబంధు చెక్కులు రెడీ అయ్యాయి. వారంలోగా ఆ చెక్కులని రైతులకి అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలివిడత కింద శాసనసభ ఎన్నికలకు ముందే దాదాపు 44 లక్షల మందికి పెట్టుబడి సాయం అందించారు. మరో ఏడు లక్షల మందికి పంపిణీ చేయాల్సి ఉండగా పలు కారణాలతో నిలిచిపోయింది. ఇప్పుడు ఆ రైతులకు పంపిణీ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు సమాచారమ్.

ఈ వారంలోపు ఆ మొత్తాన్ని రైతులకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. మార్చి 31తోనే యాసంగి కాలం ముగిసినప్పటికీ సాయం అందని వారిని దృష్టిలో పెట్టుకుని ఈ మేరకు అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 11 తర్వాత రెండో విడత రైతు బంధు చెక్కులు రైతులని చేరే అవకాశాలున్నాయి.