‘మహర్షి’లో అదే హైలైట్

సూపర్ స్టార్ మహేష్ ‘మహర్షి’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మహేష్ నటిస్తున్న 25వ చిత్రమిది. ఈ చిత్రానికి వంశీపైడిపల్లి దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే హీరోయిన్. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించారు. మే 9న మహర్షి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో మహేష్ మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు.

కాలేజె స్టూడెంట్, బిజినెస్ మేన్, రైతుగా మహేష్ కనిపిస్తారు. ఈ మూడు పాత్రల్లో రైతుగా మహేష్ నటన అదిరిపోయేలా ఉండనుందట. స్టూడెంట్, బిజినెస్ మెన్ కంటే కామన్ మెన్ గా మహేష్ ఎలా రియాక్ట్ అయ్యాడు అనే విషయం సినిమాలో హైలైట్ అవుతుందని దర్శకుడు వంశీ అన్నారు.

ఇక, ఇటీవలే విడుదలైన మహర్షి టీజర్ కి మంచి స్పందన దక్కింది. అత్యంత వేగంగా 10మిలియన్ వ్యూస్ సొంతం చేసుకొంది మహర్షి టీజర్. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు -పివిపి-అశ్వినీదత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.