రూ.140 కోట్లకు అమ్ముడుపోయిన ‘మహర్షి’ !

సూపర్ స్టార్ మహేష్ స్టామినా ఏంటో.. మరోసారి తెలిసొచ్చింది. ఆయన సినిమా హాట్ కేకులా అమ్ముడుపోవడం సహజమే. ఐతే, మహర్షి అంతుకుమించిన రేంజ్ లో అమ్ముడుపోయింది. మహర్షి మీద ఏకంగా రూ. 140కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. డిజిటల్‌, శాటిలైట్‌ రూపంలో ఈ చిత్రానికి రూ.47.5 కోట్లు వచ్చినట్టు ట్రేడ్‌ వర్గాలు లెక్కగడుతున్నాయి.

తెలుగు శాటిలైట్‌ రూపంలో రూ.14.5 కోట్లు వచ్చాయి. డిజిటల్‌ హక్కుల పరంగా మరో రూ.11 కోట్లు సంపాదించింది. హిందీ డబ్బింగ్‌, శాటిలైట్‌ హక్కులు దాదాపు రూ.20 కోట్లకు అమ్ముడయ్యాయి. ఆడియో హక్కులకు మరో రూ.2 కోట్లు. ఓవర్సీస్‌లో రైట్స్ రూపంలో రూ.12.5 కోట్ల వచ్చాయి. మొత్తమ్మీద రూ.140 కోట్ల లెక్క తేలుతోంది. మహేష్‌ కెరీర్‌లో ఇదో కొత్త రికార్డు.

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న 25వ చిత్రమిది. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. దిల్ రాజు-పివిపి-అశ్వినీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మే 9న మహర్షి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.