అధినేతలు.. ఎక్కడ ఓటేశారు ?


దేశవ్యాప్తంగా తొలిదశ పోలింగ్‌ ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో సినీ ప్రముఖులు, రాజకీయ పార్టీ అధినేతలు ఉదయమే తమ ఓటు హక్కుని వినియోగించుకొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు సిద్దిపేట నియోజకవర్గం చింతమడకలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉండవల్లిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి కడప జిల్లా పులివెందులలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ విజయవాడలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఇక, తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా ఓటు హక్కు వినియోగించుకొలేదు. ఏపీలో ప్రజాశాంతి పార్టీ కెఎ పాల్ ఓటు హక్కుని ఇంకా వినియోగించుకోలేదు. పాల్ ఓటేసేందుకు ఎప్పుడు వస్తారా ? అని మీడియా ప్రతినిధులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పాల్ వేసే జోకులు విని నవ్వుకోవడానికి. మరోవైపు, పలు చోట్ల ఈవీఎంలు మోరయిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.