ఈసీ నోటీసుకు కేసీఆర్ వివరణ

కరీంనగర్ ఎన్నికల సభలో తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. రామరాజు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదుపై ముఖ్యమంత్రికి ఈసీ కేసీఆర్ నోటీసు జారీ చేసింది. శుక్రవారం సాఅయంత్రం లోపుగా వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

దీంతో శుక్రవారం నాడు ఉదయమే కేసీఆర్ తన వివరణను ఈసీకి అందించారు. ఈ మేరకు వివరణతో కూడిన ప్రతిని రాష్ట్ర ఎన్నికల అదనపు ప్రధానాధికారి జ్యోతిబుద్దప్రకాష్‌కు టీఆర్ఎస్‌ నేతలు అందించారు. లేఖలో సీఎం కేసీఆర్ ఏం పేర్కొన్నారు అనేది తెలియాల్సి ఉంది. కేసీఆర్ వివరణతో ఎన్నికల సంఘం సంతృప్తి చెందుతుందా ? అన్నది చూడాలి.