జగన్ సెలవులపై చంద్రబాబు అనుమానాలు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంకా శాంతించడం లేదు. ఆయన ఇంకా ఎన్నికల మూడులోనే ఉన్నారు. శుక్రవారం చంద్రబాబు అమరావతిలో మీడియా సమావేశం నిర్వహించారు. మరోసారి జగన్, కేసీఆర్ లని ఉతికి ఆరేశాడు. ఎన్నికల ప్రచార సమయంలో
జగన్ మూడు రోజుల పాటు సెలవులు తీసుకోవడంపై చంద్రబాబు అనుమానాలు వ్యక్తం చేశారు.

ఎన్నికల ప్రచారం సాగుతున్న సమయంలో రాజకీయ పార్టీల నేతలు ఎవరూ కూడ ప్రచారానికి సెలవు ఇవ్వరని ఆయన గుర్తు చేశారు. ఆ సమయంలోనే ఏపీలో కుట్రలకు జగన్ ప్లాన్ చేశాడని ఆరోపించారు. ప్రతిరోజు ఎన్నికల ప్రచారం పూర్తి కాగానే సాయంత్రం ఆరు గంటలకే జగన్ హైద్రాబాద్‌ లోటస్ పాండ్‌కు చేరుకొనేవాడు. కేసీఆర్‌తో ప్రతి రోజూ ఏపీలో జరుగుతున్న పరిణామాలను రిపోర్ట్ చేశారని చెప్పుకొచ్చారు. ఏపీలో ఓటింగ్ జరిగిన తీరుపై చంద్రబాబు మరోసారి అసంతృప్తిని వ్యక్తం చేశారు.