అలర్ట్ : యాదాద్రి నిర్మాణ పనుల వీడియోలు షేర్ చేస్తే అరెస్ట్

యాదాద్రి లక్ష్మీ నరసింహా స్వామి ఆలయ నిర్మాణ పనులు జెడ్ స్వీడుతో జరుగుతున్నాయి. దాదాపు పూర్తి కావొస్తున్నాయ్. అవి పూర్తయితే.. ఆలయం అద్భుతంగా కనబడబోతుంది. ఐతే, కొందరు ఉత్సాకులు ఆలయ నిర్మాణ పనులని వీడియో తీసి యూట్యూబ్ లో వదులుతున్నారు. ఇలా చేసిన ఇద్దరు వ్యక్తులని పోలీసులు అరెస్ట్ చేశారు.

అంబర్‌పేట్‌కు చెందిన రాకేశ్(30), నవీన్(22)లను యాదాద్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమతి లేకుండా ఆలయ పునఃనిర్మాణ పనులను వీడియో తీసిన రాకేశ్ వాటిని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. ఆలయ ఈవో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీడియో ఐపీ అధారంగా వారిని అరెస్టు చేశారు.