కోల్‌కతాపై ఢిల్లీ ఘన విజయం

ధన్‌ధనాధన్‌.. ధావన్‌ కు ఓ రికార్డ్ ఉంది. ధావన్ టాప్ స్కోరర్ గా నిలిచిన చాలా మ్యాచ్ ల్లో టీమిండియా గెలిచింది. ఇప్పుడు ఐపీఎల్ లోనూ ఇదే సెంటిమెంట్ వర్కవుట్ అయింది. శుక్రవారం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శిఖర్‌ ధావన్‌(97 నాటౌట్‌, 63 బంతుల్లో 11×4, 2×6) టాప్ స్కోరర్.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. శుభ్‌మన్‌గిల్‌(65, 39 బంతుల్లో 7×4, 2×6), ఆండ్రీ రసెల్‌(45, 21 బంతుల్లో 3×4, 4×6) చెలరేగి ఆడడంతో కోల్‌కతా భారీ స్కోర్‌ సాధించింది. 178 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ శిఖర్‌ ధావన్‌ 97 నాటౌట్‌ తో పాటు.. రిషభ్‌ పంత్‌(46, 31 బంతుల్లో 4×4,2×6) రాణించడంతో ఈజీగా గెలిచేసింది.