రేపు కర్ణాటక ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు

మాజీ ప్రధాని, జేడీఎస్‌ వ్యవస్థాపకులు దేవేగౌడ ఆహ్వానం మేరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కర్ణాటక లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్నారు. జేడీఎస్‌- కాంగ్రెస్‌ కూటమి తరఫున ఆయన సోమవారం ప్రచారం నిర్వహించ నున్నారు. దేవేగౌడ, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో కలిసి చంద్రబాబు ఎన్నికల సభల్లో పాల్గొననున్నారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసింది. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కాంగ్రెస్-జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో చంద్రబాబు కీలకంగా వ్యవహరించారని తెలుగు తమ్ముళ్లు చెబుతుంటారు. అంతేగాక.. కర్ణాటకలో తెలుగు ప్రజలు చాలామంది ఉన్నారు. వారిని ఆకర్షించేందుకు జేడీఎస్ చంద్రబాబుని బరిలోకి తీసుకొస్తున్నట్టు కనిపిస్తోంది.