చెన్నై ఏడో విజయం

ధోని ఫేవరట్ నెం. 7. ఆయన కెప్టెన్ గా వ్యవహరిస్తున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఏడో విజయం సొంతం చేసుకుంది.
ఆదివారం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై గెలుపొందింది. టాస్‌ ఓడి మొదటి బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. క్రిస్‌లిన్‌(82, 51 బంతుల్లో 7×4, 6×6) ఒంటరి పోరాటం చేశాడు. చెన్నై బౌలర్లలో శార్దుల్‌ ఠాకుర్‌ 2, మిచెల్‌ శాంట్నర్‌ ఒక వికెట్‌ తీశారు.

162 పరుగుల లక్ష్యాన్ని చైన్నై ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. సురేశ్‌రైనా(57, 41బంతుల్లో 7×4,1×6), చివర్లో రవీంద్ర జడేజా(31, 17 బంతుల్లో 5×4) రాణించారు. షేన్‌ వాట్సన్‌(6), ఫా డు ప్లెసిస్‌(24), ధోనీ(16), కేదార్‌ జాధవ్‌(20) తక్కువ పరుగులకే ఔటయ్యారు. ఇది చెన్నైకి ఏదో విజయం. కాగా, కోల్ కతాకి ఇది వరుసగా రెండో పరాజయం.